Friday 27 March 2015

వాజ్‌పేయి‌కి భారతరత్న పురస్కారం.. ఇంటికెళ్లి అందించిన రాష్ట్రపతి..!


భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి‌కి ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రధానం చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్ పేయి ఇంటికి వెళ్లి ప్రణబ్ ముఖర్జీ ఆయనకు పురస్కార అందించారు. 
 
ఆ సమయంలో రాష్ట్రపతితోపాటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా ఉన్నారు. సాధారణంగా రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న పురస్కారం ప్రధానం చేయడం ఆనవాయతీ. సంప్రదాయాలను తోసిరాజని రాష్ట్రపతి మాజీ ప్రధాని నివాసానికి వెళ్లి భారతరత్న పురస్కారం అందజేయడం విశేషం.

No comments: